Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతం సవాంగ్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన గురువారంతో ఖాకీ దుస్తులను వదులుకున్నారు. 
 
ఏపీ ముఖ్యమంత్రిగా జనగ్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర డీజీపీగా ఏరికోరి గౌతం సవాంగ్‌‍ను నియమించిన విషయం తెల్సిందే. ఆయనకు డీజీపీగా మరికొంతకాలం సర్వీసు ఉంది. అయినప్పటికీ సీఎం జగన్ అభ్యర్థన మేరకు ఆయన ముందస్తుగా ఉద్యోగ విరమణ చేశారు. 
 
అదేసమయంలో గౌతం సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి జగన్ నియమించారు. దీంతో ఆయన గురువారం ఆ బాధ్యతలను స్వీకరించారు. గురువారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్‌గా సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన సవాంగ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments