Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 February 2025
webdunia

ముగిసిన గౌతం రెడ్డి అంత్యక్రియలు - సీఎం జగన్ చివరి చూపు...

Advertiesment
ముగిసిన గౌతం రెడ్డి అంత్యక్రియలు - సీఎం జగన్ చివరి చూపు...
, బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:57 IST)
ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని తన సహచరుడుని చివరి చూపు చూసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సీఎం జగన్ దంపతులతో పాటు ఏపీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. 
 
ఈ అంత్యక్రియల్లో వైకాపా కార్యకర్తలు, గౌతం రెడ్డి అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చి, తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇవి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగాయి. ఇందుకోసం గౌతం రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయగిరికి తరలిచారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఉదయగిరికి చేరుకుని నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంధకారంలోకి చంఢీఘర్‌ - 32 గంటలుగా ఆగిన విద్యుత్ సరఫరా