Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు ఊరట.. జూలై నెల వీసా కోటా రిలీజ్ చేసిన యూఎస్ కాన్సులేట్

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (09:54 IST)
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు ఊరట శుభవార్త అందింది. జులైలో ప్రారంభంకానున్న తరగతులకు హాజరు కావాల్సిన విద్యార్థుల గడువును మరో 25 రోజులు పొడిగిస్తూ యూనివర్సిటీలు నిర్ణయించాయి. అదేసమయంలో జూలై నెల వీసా కోటాను కూడా యూఎస్ కాన్సులేట్ రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
ఆగస్టు పదో తేదీ నుంచి మరికొన్ని యూనివర్సిటీలు ప్రారంభంకానుండగా, ఆయా వర్సిటీల అధికారులతో సంప్రదించి తేదీలను తెలుసుకోవాలని సూచించారు. మరోవైపు, కరోనా కారణంగా భారత్‌లో వీసా ప్రక్రియ నిలిచిపోయింది. 
 
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని కాన్సులేట్ల ద్వారా విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియను ఈ నెల 14 నుంచి ప్రారంభించాయి. 
 
ఇదిలావుంటే, శుక్రవారం జులైకి సంబంధించిన వీసా కోటాను కూడా విడుదల చేయడంతో విద్యార్థులు స్టాట్స్ పొందారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments