Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాకు టాటా చెప్పేసిన అమెరికా కంపెనీ... తన్నుకుపోయిన తెలంగాణ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. నిన్నటికి నిన్న రిలయన్స్ ఆంధ్రా నుంచి వెళ్లిపోయింది. ఇపుడు అమెరికాకు చెందిన ట్రైటాన్ సంస్థ కూడా టాటా చెప్పేసింది. ఈ సంస్థ తెలంగాణాలో భారీ విద్యుత్‌ వాహనాల యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.  దీనిపై గురువారం ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కూడా కుదిరింది. దీనివల్ల రూ.2100 కోట్ల పెట్టుబడి, దాదాపు 25వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే... ఇదే ట్రైటాన్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో 2018 సెప్టెంబరు 29వ తేదీన ఎంవోయూ కుదుర్చుకుంది. టీడీపీ సర్కారు హయాంలో ఆ కంపెనీతో మాట్లాడి నవ్యాంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు వివరించి ఇక్కడకు వచ్చేలా ఒప్పించారు. రూ.727 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సోలార్‌ బ్యాటరీ తయారీ ప్లాంటు నిర్మించేందుకు ‘ట్రెటాన్‌ సోలార్‌’ ముందుకు వచ్చింది. ఇది ప్రింటబుల్‌ సోలార్‌ సెల్స్‌, ప్రింటెడ్‌ లైటింగ్‌, ప్రింటెడ్‌ బ్యాటరీల తయారీలో అగ్రశ్రేణి సంస్థ. కానీ, ఏపీ సర్కారు వ్యవహారశైలి కారణంగా పొరుగు రాష్ట్రానికి తరలివెళ్లిపోయింది.
 
ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుపతి సమీపంలో ప్రారంభిస్తామన్న సెజ్‌తోపాటు అమరావతిలోను ఒక భారీ సెజ్‌ను పెట్టేందుకు చర్చలు జరిగాయి. చైనాలోని అతి పెద్ద సెజ్‌ల మాదిరిగా ఇక్కడ కూడా ఒకేచోట లక్షమందికి ఉపాధి కల్పించేలా ఈ సెజ్‌ను పెట్టాలని భావించారు. అయితే ఇప్పుడు తిరుపతిలో పెట్టేందుకు కుదిరిన ఎంఓయూ నుంచే రిలయన్స్‌ వెనక్కి వెళ్లిపోయింది. ఇక అమరావతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదం చేయడంతో... ఇక్కడకూ రాకుండా పోయిందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments