Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందరాజస్వామి ఆలయ కిరీటాలను ఎలా చేశాడో చూడండి

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (22:02 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన మూడు కిరీటాలను దొంగిలించిన దొంగను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 80 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందార్ తాలూకా స్వప్నభూమ్ నగర్‌కు చెందిన ఆకాష్ ప్రతాప్ సరోడిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మూడు కిరీటాలను కరిగించి బంగారుముద్దలా తయారుచేశాడు. వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తిరుపతిలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 
 
మూడు కిరీటాల విలువ 42 లక్షల 35 వేల 385 రూపాయలు విలువ ఉంటుందని, ఫిబ్రవరి 2వ తేదీ నిందితుడు కిరీటాలను దొంగిలించారని ఎస్పీ తెలిపారు. నిందితుడిని సి.సి. కెమెరా ఆధారంగా గుర్తించామన్నారు. 78 సి.సి. కెమెరాల్లో నిందితుడి కదలికలు రికార్డ్ అయ్యాయని, 40 మంది పోలీసులు 80 రోజుల పాటు కష్టపడి నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడు దొంగతనం చేసిన తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల కనిపెట్టడం కష్టమైందన్నారు ఎస్పీ అన్బురాజన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments