Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు.. ఇపుడు.. ఎపుడైనా... బోటు ప్రమాదాలన్నీ ఆదివారమే..

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (11:55 IST)
అది గోదావరి కావొచ్చు లేదా కృష్ణా నది కావొచ్చు... మరోనదైనా కావొచ్చు... ఏ నదిలోనైనా బోటు ప్రమాదం జరిగినా అది ఆదివారం పూటే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది. తాజాగా గోదావరి నదిలో దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం కూడా ఆదివారమే సంభవించింది. మొత్తం 61 మందితో వెళుతున్న ప్రమాదం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది చనిపోగా, 25 మంది గల్లంతయ్యారు. మరో 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 
 
అయితే, ఈ బోటు ప్రమాదాలన్నీ ఆదివారమే జరిగాయి. గతంలో జరిగిన ప్రమాదాల వివరాలను పరిశీలిస్తే, విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద 12 నవంబరు 2017న కృష్ణానదిలో భక్తులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగింది ఆదివారమే.
 
గతేడాది జులైలో దేవీపట్నం సమీపంలో బోటు తిరగబడి 15 మంది చనిపోయారు. ఇది కూడా ఆదివారమే జరిగింది. తాజా ప్రమాదం కూడా ఆదివారమే జరిగింది. శని, ఆదివారాలు వరసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఆనందంగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఏపీ, తెలంగాణలోని పలు కుటుంబాల్లో ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments