Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు.. ఇపుడు.. ఎపుడైనా... బోటు ప్రమాదాలన్నీ ఆదివారమే..

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (11:55 IST)
అది గోదావరి కావొచ్చు లేదా కృష్ణా నది కావొచ్చు... మరోనదైనా కావొచ్చు... ఏ నదిలోనైనా బోటు ప్రమాదం జరిగినా అది ఆదివారం పూటే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది. తాజాగా గోదావరి నదిలో దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం కూడా ఆదివారమే సంభవించింది. మొత్తం 61 మందితో వెళుతున్న ప్రమాదం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది చనిపోగా, 25 మంది గల్లంతయ్యారు. మరో 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 
 
అయితే, ఈ బోటు ప్రమాదాలన్నీ ఆదివారమే జరిగాయి. గతంలో జరిగిన ప్రమాదాల వివరాలను పరిశీలిస్తే, విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద 12 నవంబరు 2017న కృష్ణానదిలో భక్తులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగింది ఆదివారమే.
 
గతేడాది జులైలో దేవీపట్నం సమీపంలో బోటు తిరగబడి 15 మంది చనిపోయారు. ఇది కూడా ఆదివారమే జరిగింది. తాజా ప్రమాదం కూడా ఆదివారమే జరిగింది. శని, ఆదివారాలు వరసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఆనందంగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఏపీ, తెలంగాణలోని పలు కుటుంబాల్లో ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments