Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోటు ప్రమాద ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:46 IST)
బోటు ప్రమాద ప్రాంతంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను మఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పర్యవేక్షించారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన ముఖ్యమంత్రి బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాద ఘటనుంచి బయటపడి చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో వారిని కలుసుకుని ధైర్యం చెప్పారు. డాక్టర్లు అందిస్తున్న చికిత్స, ఇతరత్రా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
పలువురు బాధితులను ఆయన స్వయంగా పరామర్శించారు. ఉప్పల్‌కు చెందిన జానకిరామారావును పరామర్శించిన సీఎం కుటుంబాన్ని కోల్పోయిన జానకి రామారావుకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో భుజానికి గాయం, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌ జిల్లా కరిపికొండెం బాధితులను కూడా పరామర్శించారు. 
 
బాధితులందరికీ మంచి వైద్యం అందించాలంటూ వైద్యులను ఆదేశించారు. కోలుకున్న తర్వాతనే వారందన్నీ ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. దేనికీ వెనుకాడవద్దని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆస్పత్రివద్దే సీఎం కలసుకున్నారు. మృతదేహాలు గ్రామాలకు తరలించేందుకు అన్నిఏర్పాట్లూ చేయాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 
ముఖ్యమంత్రి వెంట మంత్రులు కన్నబాబు, ఆళ్లనాని, పినిపె విశ్వరూప్, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, తెలంగాణమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments