Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఏడాది పాటు సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:21 IST)
బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పాతబస్తీలో ఏడాది నుంచి బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫతేదర్వాజకు చెందిన మహ్మద్‌ షఫిక్‌, మహ్మద్‌ సైఫ్‌అలీతో పాటు అదే బస్తీకి చెందిన మరో ముగ్గురు మైనర్లు స్నేహితులు. జల్సాగా తిరిగే వీరు వ్యసనాలకు బానిసయ్యారు. 
 
తొమ్మిదో తరగతి చదువుతున్న సైఫ్ అతని క్లాస్‌మేట్ అయిన ఓ బాలికతో పాటు ఏడో తరగతి చదువుతున్న ఆమె చెల్లెలితో చనువుగా వుండేవాడు. మాయమాటలతో లొంగదీసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె చెల్లెలిపై కూడా కన్నేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇలా ఏడాదికాలం నుంచి జరుగుతోంది. 
 
రోజురోజుకు వీరి ఆగడాలు అధికం కావడంతో... ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారి సహాయంతో కమాటీపురా పోలీసులను ఆశ్రయించారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మేజర్లతోపాటు, ముగ్గురు మైనర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం