Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువకుల మధ్య అమ్మాయి గొడవ, మధ్యలోకెళ్లిన తెరాస నేత దారుణ హత్య

యువకుల మధ్య అమ్మాయి గొడవ, మధ్యలోకెళ్లిన తెరాస నేత దారుణ హత్య
, బుధవారం, 18 మార్చి 2020 (14:08 IST)
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయమై కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు గొడవపడ్డారు. అలా గొడవపడవద్దంటూ వారించబోయిన తెరాస నాయకుడుని సదరు కుర్రాళ్లు దారుణంగా పొడిచి చంపారు.
 
వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మంగళవారం రాత్రి మృతుడు లతీఫ్‌ సోదరుడు జహంగీర్‌ కుమారుడు తన వాట్సాప్‌ స్టేట్‌స్ లో ఓ యువతికి పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెపుతూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు నేరుగా జహంగీర్ కుమారుడిపై లతీఫ్ షాపు ఎదుటే దాడి చేయడం ప్రారంభించారు. ఇది చూసన లతీఫ్ వారిని వారించబోయాడు. 
 
ఇలాంటి తగాదాలు ఇక్కడ రాత్రివేళల్లో చేయవద్దనీ, రేపు ఉదయం వివరంగా మాట్లాడుకోవచ్చని నచ్చజెపుతుండగా యువకులు అతడిపైన కూడా దాడి చేశారు. కత్తితో లతీఫ్‌ను పొడిచారు. దీనితో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కారుకు సుప్రీంలో షాక్ : ఎస్ఈసీ నిర్ణయంలో వేలుపెట్టం