Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్‌ ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా : జేసీ మార్కండేయులు

Webdunia
గురువారం, 4 జులై 2019 (10:02 IST)
తిరుపతి ఎల్‌పీజీ సిలెండర్‌ను వినియోగించే ప్రతి వినియోగదారుడికి ఎల్‌పీజీ ప్రమాద బీమా రక్షణ పాలసీ అందుబాటులో ఉంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ మార్కండేయులు పేర్కొన్నారు. 
 
గురువారం జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో రూపొందించిన 'గ్యాస్‌ సిలెండర్‌ వినియోగదారుల బీమా రక్షణ.. గ్యాస్‌ వాడకంలో భద్రతా సూచనలు' అనే కరపత్రాల్ని జేసీ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహ గ్యాస్‌ వినియోగంలో ప్రమాదం జరిగితే ప్రతి వ్యక్తికి వైద్య ఖర్చులకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు బీమా సొమ్ము పొందవచ్చని తెలిపారు. ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా వస్తుందని వెల్లడించారు. 
 
ఎల్‌పీజీ వినియోగదారులు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎల్‌పీజీ డీలర్‌కు, అగ్ని ప్రమాద అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేసి ప్రాంతీయ బీమా కార్యాలయం ద్వారా సహాయాన్ని పొందొచ్చని తెలిపారు. 
 
దీనిపై ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు ప్రజలను చైతన్యం వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పి.రాజారెడ్డి, కార్యదర్శి ఎం.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌, ఎస్‌.రామారావు, ఎన్‌.శేషాద్రి, ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments