Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాకు 'గంట' కొట్టేశారు... త్వరలో కాషాయ తీర్థం?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (09:58 IST)
తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పనున్నారు. ఆయన పేరు గంటా శ్రీనివాస రావు. పార్టీల మారడంలో తనకు మించినవారు మరొకరు లేరని మరోమారు ఆయన నిరూపించుకోనున్నారు. ఇప్పటికే, పలు మార్టీలు మారిన గంటా శ్రీనివాస రావు... త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. వీటిని రుజువు చేసేలా గంటా శ్రీనివాస రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడటం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా సుజనా, సీఎం రమేశ్‌తో కూడా చర్చలు జరిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments