స్వచ్ఛంద విరమణకు క్యూ కడుతున్నారు... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (09:38 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్). ఈ సంస్థతో పాటు ఎంటీఎన్ఎల్ సంస్థలను విలీనం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. అదేసమయంలో ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. 50 యేళ్లు పైబడిన ఉద్యోగులు వీఆర్ఎస్‌కు అర్హులుగా ప్రకటించింది. దీంతో వేలాది మంది ఉద్యోగులు స్వచ్ఛంద విరమణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ ఆఫర్ ప్రారంభమైన రెండు రోజుల్లేనే ఒక్క బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నుంచే 22 వేల దరఖాస్తులు వచ్చాయని సంస్థ అధికారులు తెలిపారు. ఈ నెల 5న ప్రారంభమైన వీఆర్‌ఎస్ పథకం డిసెంబర్ 3వ తేదీన ముగియనుంది. తొలి రెండు రోజుల్లో వచ్చిన దరాఖాస్తుల్లో 13 వేల దరఖాస్తులు గ్రూప్ సి తరగతికి చెందిన ఉద్యోగులవేనని అధికారులు పేర్కొన్నారు. 
 
బీఎస్‌ఎన్‌ఎల్‌లో మొత్తం లక్షా యాభైవేల మంది ఉద్యోగులున్నారన్నారు. వీరిలో యాభై ఏళ్ల వయసు మీరిన లక్షమంది వీఆర్‌ఎస్‌కు అర్హులుగా ఉండగా, వారిలో 70 నుంచి 80 వేల మంది వీఆర్‌ఎస్ తీసుకుంటారని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే జరిగితే సంస్థకు నెలకు ఏడువేల కోట్ల రూపాయల మేర వ్యయం తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments