Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెల్మెట్లు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కడ?

హెల్మెట్లు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కడ?
, గురువారం, 7 నవంబరు 2019 (20:51 IST)
తెలంగాణా రాష్ట్రంలో తహశీల్ధార్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అయితే ఈ హత్య తరువాత ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులైతే తమ స్థానంలో కూర్చోవాలంటేనే వణికిపోతున్నారు. ఏ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఉత్తరప్రదేశ్ లోని బాందాజిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా హెల్మెట్లు ధరించి ఉద్యోగం చేస్తున్నారు.
 
విద్యుత్ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వహించడానికి ప్రధాన కారణం ఒకటుంది. వారు ఉన్న భవనం పైకప్పు పూర్తిగా శిథిలమైపోవడం.. ఎప్పుడు ఎక్కడి నుంచి పెచ్చులు ఊడి మీదపడతాయో తెలియక పోవడంతోనే తమ ప్రాణాలకు రక్షణగా హెల్మెట్లు తెచ్చుకుని.. వాటిని తలకు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారట. 
 
ఏ విధమైన దుర్ఘటనలు జరిగినా, ప్రాణాలైనా మిగులుతాయి కదా అన్నదే తమ ఉద్దేశమంటున్నారు ఉద్యోగులు. భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవిందా... గోవిందా... శ్రీనివాసుని వద్ద రమణదీక్షితులు(video)