Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిత్రపక్షం అధికారంలో వుండి ఇంత నిర్లక్ష్యమా.. కుంటిసాకులా?: మంత్రి గంటా

తెలుగుదేశం పార్టీ బీజేపీతో కటీఫ్‌ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (16:00 IST)
తెలుగుదేశం పార్టీ బీజేపీతో కటీఫ్‌ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మిత్రపక్షం అధికారంలో వుండి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం ఘోర తప్పిదమని.. రైల్వే జోన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని కుంటిసాకులు చెప్తోందని మండిపడ్డారు. 
 
కేంద్ర విద్యా సంస్థలకు మొక్కుబడిగా నిధులిచ్చారని.. రూ.4,500 కోట్లు అడిగితే రూ.218 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్‌ల గురించిన ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం దారుణమని తెలిపారు.
 
తమ అధినేత చంద్రబాబునాయుడు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎంతో సహనంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర విద్యా సంస్థలకు ఏపీ సర్కారు 3658 ఎకరాలను కేటాయించిందని, నామ మాత్రపు చర్యలతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరికాదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments