Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ఉద్ధవ్ థాక్రే ఫోన్- బీజేపీతో కటీఫ్ చేస్కోండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే మీడియా సమక్షంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. బాబుకు ఉద్ధవ్ ఫోన్ చేయడం ప్ర

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (14:29 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ఉద్ధవ్ థాక్రే మీడియా సమక్షంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. బాబుకు ఉద్ధవ్ ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబు, థాక్రేల మధ్య ఫోన్ సంభాషణ సుమారు అరగంట పాటు నడిచిందని సమాచారం. 
 
ఈ సందర్భంగా బాబుతో ఉద్ధవ్ థాక్రే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  బీజేపీతో కటీఫ్ కావాలనుకుంటున్న బాబుకు ఉద్ధవ్ థాక్రే మాటలు మరింత బలాన్నిచ్చాయని సమాచారం. అంతేగాకుడా బీజేపీతో పొత్తు రద్దు చేసుకుని శివసేన, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి 2019లో బీజేపీతో పోరాడుదామని చంద్రబాబుకు థాక్రే వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ వ్యవహారంపై నిశితంగా పరిశీలించుకుని తన నిర్ణయాన్ని చెప్తానని ఉద్ధవ్ థ్రాకేతో బాబు వెల్లడించినట్లు సమాచారం. 1990 నుంచి బీజేపీ-శివసేన మధ్య ఏదో రకంగా పొత్తు కొనసాగుతూనే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా ఉద్దవ్ థాక్రే తేల్చిచెప్పేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments