Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బ‌రికాయ‌ల మాటున ర‌వాణా; రూ.2 కోట్ల గంజాయి పట్టివేత

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:32 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గంజాయి ఒక రాజ‌కీయ అంశంగా మారిపోయి, భారీగా వివాదాలు జ‌రుగుతున్న త‌రుణంలో గంజాయిపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. స‌రిహ‌ద్దుల్లో గంజాయి అక్ర‌మ ర‌వాణాపై దృష్టి సారించారు. చింతూరు ఫారెస్ట్ నుంచి ర‌వాణా అవుతున్న గంజాయిని మాటు వేసి ప‌ట్టుకుంటున్నారు.
 
తూర్పు గోదావరి జిల్లా చింతూరు పరిధిలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని మోతుగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద తని ఖీలు చేస్తుండగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల నుంచి హైదరాబాద్కు కొబ్బరికాయలు మాటున తరలిస్తున్న 2000 కిలోల గంజాయిని పట్టు కున్నామ‌ని చెప్పారు.
 
గంజాయితో పాటు వ్యాన్, కారు, మూడు చర వాణులు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నామ‌ని   వివరించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా లింగాపురం మండలం కొత్తపల్లికి చెందిన న్యాయవాది కడియం గురుసాగర్, నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం, చెందిన పొగిడాల పర్వతాలు, ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ మండలం కూర్మనూర్కు చెందిన నైని రామారావును అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. సీఐ యువకుమార్, ఎస్సై సత్తిబాబు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments