9వేల కొబ్బరికాయలతో గణేశుడు

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:24 IST)
9వేల కొబ్బరికాయలతో 30 అడుగుల ఎత్తున్న గణేశ్ విగ్రహాన్ని భక్తులు రూపొందించిన ఉదంతం బెంగళూరులో వెలుగుచూసింది.

పుట్టెంగల్లీ ప్రాంతానికి చెందిన 70 మంది భక్తులు 20 రోజుల పాటు శ్రమించి 9వేల కొబ్బరికాయలతో పర్యావరణ హిత గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు. కొబ్బరికాయలతో గణనాథుడిని తయారు చేసిన భక్తులు 20 రకాల కూరగాయలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు.

పర్యావరణహిత గణేశుడిని తయారు చేయాలనే లక్ష్యంతో తాము దీన్ని రూపొందించామని భక్తుడు మోహన్ రాజు చెప్పారు. దీంతోపాటు నిపుణులైన వంటవారితో టన్ను హల్వాను తయారు చేసి గణేశ్ వద్ద పెట్టామని మోహనరాజు చెప్పారు.

వినాయక ఉత్సవాలు 5 రోజుల పాటు చేసిన తర్వాత పర్యావరణహిత గణేశుడిని తొలగించి కొబ్బరికాయలు, కూరగాయలు, హల్వాను భక్తులకు పంపిణీ చేస్తామని రాజు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments