Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణపతి లడ్డూను దోచుకెళ్లిన దొంగ.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:03 IST)
వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే.. దొంగలు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. మంచి టైమ్ చూసుకుని.. గణేష్ మండపంపై కన్నేసి వుంచుతున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గణేష్ మండపంలో దొంగ లడ్డూ ఎత్తుకెళ్లాడు. 
 
నంద్యాల టుటౌన్ సమీపంలో గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి.. భారీ గణపతి ప్రతిమకు భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా నాయకుడి చేతిలో లడ్డుని కూడా ప్రసాదంగా పెట్టారు. ఈ లడ్డుని నవరాత్రుల అనంతరం.. వేలం పాటలో దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. 
 
వేలంలో ఈ లడ్డూను దక్కించుకుంటే కుటుంబానికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments