ఏపీలో త్వరలోనే పూర్తి స్థాయి లాక్ డౌన్ ?

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:36 IST)
రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండడం, రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడం అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు.

నేటి నుండి కిరాణా షాపులకు, ప్రజల నిత్య అవసరాల కోసం, ప్రజల రోజువారీ కార్యక్రమాల నిమిత్తం మధ్యాహ్నం 12 వరకు అనుమతిని ఇచ్చింది. అనంతరం 12 తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని ఆదేశాలు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రజలు 12 తర్వాత రోడ్లపైకి రాకూడదని నిబంధనలు విధించారు. మరో వైపు పోలీసు అధికారులు సైతం ప్రజా రక్షణ కొరకు 12 తర్వాత కర్ఫ్యూ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
 
అయితే నరసరావుపేట ,రొంపిచర్ల మండలాలలో మాత్రం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకే ప్రజల నిత్య అవసరాల కోసం, వ్యాపారాలు, ఇతర పనులకు అనుమతిస్తున్నారు. అనంతరం ఉదయం 8 నుండి రోజంతా పూర్తిగా  కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

రొంపిచర్ల, నరసరావుపేట మండలాలలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతుండడం, కరోనా మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఇలా కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎస్‌ఐ పి.హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ కర్ఫ్యూ సరిగ్గా జరిగేలా 8 తర్వాత ఎవరూ రోడ్లపై కనపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఇదే తరహాలో కర్ఫ్యూ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న కరోనా విజృంభణకు కళ్లెం వేసే దిశలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా లాక్ డౌన్ అంటే ప్రజలు ఇబ్బంది, కంగారు పడతారని కొద్ది రోజులు కర్ఫ్యూ విధించి ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా తీవ్రత తగ్గించి  ప్రజల్ని  కాపాడాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని  ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏమౌతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

తర్వాతి కథనం
Show comments