Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు ఉచిత కళ్లజోళ్లు

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (09:45 IST)
రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు పథకం ద్వారా సుమారు కోటిన్నర మంది పేదలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణి చేయనుంది. ఇందుకోసం రూ.250 కోట్ల వరకు ఖర్చుచేస్తోంది. మరో 8లక్షల మందికి క్యాటరాక్ట్, ఇతర శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు.

కంటి వెలుగు పథకం అమలు కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రూ.500 కోట్లను కేటాయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 2022 జనవరి 31 వరకు 6 దశల్లో ఈ పథకం.. కార్యక్రమాలు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు చేసింది. ఒక్కో కిట్ వ్యయం రూ.150 తొలి, రెండు దశల్లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 70 లక్షల మందికి కంటి పరిక్షలు నిర్వహిస్తారు.

ఈ క్రమంలో నిర్ధేశిత చార్టులోని అక్షరాలను 10 అడుగుల దూరం నుంచి వారి చేత చదివిస్తారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో టార్చ్​​లైట్, చార్టు, టేపును కిట్ రూపంలో పంపిణీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.ఒక్కో కిట్​కు రూ 150 వరకు ఖర్చుపెడుతున్నారు.

మూడు నుంచి ఆరు దశల్లో సుమారు 4 కోట్ల మందికి కంటి పరిక్షలు జరుపుతారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల చేపడతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శస్త్ర చికిత్సలు చేసిన సంస్థలకు చెల్లింపులు జరుగుతాయి. డయాబటిక్, రెటినోపతి, చైల్డ్​హుడ్​, బ్లైండ్​నెస్ గ్లకోమా కేసులకు రూ.2 వేల చొప్పున చెల్లించనున్నారు.

అంధత్వంలో 80శాతం సమస్యలకు ముందస్తు పరిక్షలు ద్వారా తగ్గించవచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.ఈ పథకం అమలులో భాగంగా తాత్కాలికంగా 400 ఆప్తమాలిక్ అసిస్టెంట్ నియామకాలు చెపట్టపోతున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments