తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు

ఐవీఆర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (11:42 IST)
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సత్వర సహాయ చర్యలను ప్రారంభించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రభావిత ప్రాంతాలలో వున్న ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, చక్కెర కిలో ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ సరుకులన్నిటినీ వెంటనే పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనురుకి ఆదేశాలు జారీ చేసారు. 
 
కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మొంథా తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను ధాటికి 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఇంకా అలల ఉధృతి భారీగా వుంది. అలాగే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేగవంతమైన గాలుల కారణంగా విద్యుత్, రైల్వే మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. పంటలు నీటమునిగాయి. పలువురు నిరాశ్రయులైనారు. ఈ తుఫాను ఇప్పటివరకు నలుగురు ప్రాణాలను బలిగొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments