Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో గుప్త నిధులు పేరిట మోసం

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:23 IST)
కర్నూలు జిల్లాలో గుప్తనిధులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఓ అమాయకుడి నుంచి రూ.13.5లక్షలు టఓకరా వేసిన సంఘటన ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.

ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు అనే వ్యాపారి వద్దకు 2017లో కొందరు వ్యక్తులు వచ్చి గుప్తనిధులు ఇప్పిస్తామని నమ్మబలికారు. కొత్తపల్లి మండలంలోని ఓ పొలంలో  నిధిని బయటకు తీసేందుకు పూజలు చేయాల్సి ఉందని, అందుకు కొంత సొమ్ము ఖర్చవుతోందని చెప్పారు.

గుప్తనిధులపై అత్యాశతో శ్రీనివాసులు కొంత మొత్తం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు అవసరం ఉందని ఆ వ్యక్తులు పలుమార్లు వ్యాపారి నుంచి సుమారు రూ.13.5 లక్షల వరకు వసూలు చేశారు. అంతడబ్బు తనవద్ద లేకున్నప్పటికీ గుప్తనిధుల కోసం అప్పుచేసి మరీ వారికి సొమ్ము ఇచ్చారు.

మూడేళ్లు దాటినా గుప్తనిధులు ఇవ్వకపోగా.. సొమ్మును కూడా తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తనను బెదిరించారని బాధితుడు శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments