Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి దుర్వినియోగం... ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సస్పెన్షన్

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (08:57 IST)
నిధుల దుర్వినియోగం కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెడ్ చేసింది. పైగా, విజయవాడ నగరం వదిలి వెళ్లొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ గత వైకాపా ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో వైకాపా పెద్దలతో అంటకాగి, ఇష్టానురీతిలో రెచ్చిపోయారు. అనేక రకాలైన అవినీతి చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. 
 
సీఐడీ చీఫ్‌గా సంజయ్ బాధ్యతలు చేపట్టకముందు అగ్నిమాపకదళ విభాగం డీఐజీగా పని చేశారు. ఆ సమయంలో ఆయన రూ.కోటి మేరకు నిధులను దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. చేపట్టిన పనులు పూర్తి చేయకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు గుర్తించింది. సౌత్రిక టెక్నాలజీసి అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్.. ఈ మేరకు దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది. 
 
దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్‌పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీచేసింది. దళితులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయనను ఏపీ ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments