Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుకు తాళం మ‌రిచితిరి, దొంగా దొంగా అని అరిచితిరి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (16:25 IST)
మ‌నం ఎక్కిడికైనా వెళితే, ఇంటికి తాళం సరిగా వేశామా?  లేదా అని ఒకటికి ప‌ది సార్లు చెక్ చేసుకుంటాం. కానీ, ఏకంగా బాంకుకే తాళం వేయ‌డం మ‌రిచిపోయారు ఇక్క‌డ సిబ్బంది. పైగా ఉద‌యాన్నే వ‌చ్చి త‌లుపులు తెరిచి ఉన్నాయ‌ని, దొంగ‌లు ప‌డ్డార‌ని కంప్ల‌యింట్ ఇచ్చారు. అంతా చెక్ చేసి... ఎంత‌టి మ‌హానుభావులు బాబూ మీరు అని పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.
 
ప్రకాశంజిల్లా కనిగిరిలో ఈ ఘటన జ‌రిగింది. కనిగిరిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కాసేపు అంద‌రినీ హ‌డ‌లించింది. సోమ‌వారం సాయంత్రం బాంకుకు తాళాలు వేయడం మరిచిన సిబ్బంది, ఉదయం వచ్చి చూసే సరికి తాళాలు తీసి ఉండటాన్నిగమనించి...  చోరీ జరిగినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప‌రుగు ప‌రుగున వ‌చ్చిన పోలీసులు తీరా, దొంగ‌ల ఆచూకి కోసం సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. చివ‌రికి ఏ దొంగా రాలేదు...కేవ‌లం బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమేనని తేల్చిన చెప్పారు పోలీసులు. ముందు రోజు తాళం వేయ‌కుండా అజాగ్ర‌త్త‌గా సిబ్బంది వెళ్లిపోయార‌ని, త‌ర్వాతి రోజు వ‌చ్చి తాళాలు తెరిచి ఉన్నాయ‌ని కంప్ల‌యింట్ చేశార‌ని ఓ నిట్టూర్పు విడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments