Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎవరి పని?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:19 IST)
ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే, ఈ ప్రమాదం వల్ల ఈవీఎంలు భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదనీ, ఓట్ల లెక్కింపు యధావిధిగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంపై వైకాపా, టీడీపీ నేతలు పలు అనుమానాలు వెల్లడిస్తున్నారు. ఈ పని చేసింది వైకాపా నేతలు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. కాదు టీడీపీ నేతలేనంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు, ఈ దఫా ఎన్నికల పోటీలో టీడీపీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట రమణ భార్య ఎం సుగుణమ్మ పోటీలో వుంటే వైకాపా తరపున భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 
 
నిజానికి గత 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం.వెంకటరమణ కొద్ది కాలానికే చనిపోవడంతో ఆయన భార్య ఎం.సుగుణను ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. వైసీపీ పోటీ పెట్టకపోవడంతో ఆమె లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. పోటీ తీవ్రంగానే ఉండనున్నది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments