Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పిల్లల గొంతు కోసిన తండ్రి... ఆపై తానుకూడా...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (15:53 IST)
గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. మద్యం మత్తులో తన ఇద్దరు పిల్లల గొంతులను కోశాడు. ఆపై తాను కూడా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తాడేపల్లికి చెందిన రమణమూర్తి(35) చిలకలూరిపేటలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆస్తి విషయంలో కొంత కాలంగా అత్తవారింటితో విరోధం ఏర్పడింది. తరచూ తగువు పడుతుండేవారు. మద్యానికి బానిసై భార్యను కూడా వేధిస్తుండేవాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ బుధవారం సాయంత్రం గొడవపడ్డారు. భార్య కోపంతో పుట్టింటికి వెళ్లి పోయింది. నిన్న రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చిన రమణమూర్తి తన పిల్లలు భవాని నాగదినేశ్‌(8), సాయి(6)ని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆపై తాను కూడా ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments