Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్, కుమార్తె పుష్పావతి అయితే డబ్బులు లేక తండ్రి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (17:30 IST)
అసలే నిరుపేద కుటుంబం. ఒక్కగానొక్క కూతురు. తండ్రి ఆటోడ్రైవర్. కుమార్తె పుష్పావతి అయ్యింది. ఓణీ ఫంక్షన్ చేయాలని భార్య ఒత్తిడి. చేతిలో డబ్బులు లేవు. కరోనాతో ప్యాసింజర్లు కరువయ్యారు. అప్పు ఇచ్చేందుకు ఏ స్నేహితుడు ముందుకు రాలేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ తండ్రి. ఆత్మహత్య చేసుకున్నాడు.
 
తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరు చంద్రయ్య. స్థానికంగా తుమ్మలగుంటలోనే నివాసముండేవాడు. మూడునెలల పాటు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
 
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబంలో కుమార్తెకు ఓణీ ఫంక్షన్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇంట్లో భార్య నుంచి ఒత్తిడి ఎక్కువైంది. చుట్టుప్రక్కల వారు ప్రశ్నించారు. ఎప్పుడు కూతురు ఓణీల ఫంక్షన్ అని అడిగారు. తండ్రిగా తాను ఆ చిన్న ఫంక్షన్ కూడా చేయలేకపోతున్నానని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments