Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (21:38 IST)
కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది.
 
మరణించినవారిలో 26 ఏళ్ల భూషణం, 27 ఏళ్ల ధర్మవరప్రసాద్, 32 ఏళ్ల లోవరాజు, నాగరాజు, జయరామ్ వున్నట్లు గుర్తించారు. మృతులు కోనసీమ జిల్లాకు చెందినవారు కొందరు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరికొందరు వున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక లారీలో పదిమంది, మరో లారీలో ఇద్దరు వున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా మంత్రి కొల్లు రవీంద్ర మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాశంలో 28న అత్యంత అరుదైన తోక చుక్క.. మన కళ్లతో చూడొచ్చు

భారతదేశం నుండి రెండు ప్రపంచ చిహ్నాలు మోదీ, దేవీ శ్రీప్రసాద్ అంటూ ట్వీట్

ధనుష్‌ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్?

ఎన్టీఆర్ చాలాకాలం తర్వాత ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు.. నాగవంశీ

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డని క్రాక్ గాడుగా ఎందుకుంటాడ‌నేదే చెప్పబోతున్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

తర్వాతి కథనం
Show comments