Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

రోడ్డు ప్రమాదం- నలుగురు యూట్యూబర్ల మృతి.. ర్యాష్ డ్రైవింగే కారణమా?

Advertiesment
car accident

సెల్వి

, సోమవారం, 10 జూన్ 2024 (18:08 IST)
రోడ్డు ప్రమాదం నలుగురు యూట్యూబర్లను బలి తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో  "రౌండ్ టు వరల్డ్"లో కామెడీ స్కెచ్ వీడియోలను రూపొందించే నలుగురు యూట్యూబర్‌లు కారు ప్రమాదానికి గురయ్యారు. వారు పార్టీ నుండి తిరిగి వస్తుండగా, వారి స్కార్పియో వస్తున్న బొలెరోను ఢీకొట్టింది. స్కార్పియోలో ఆరుగురు ఉన్నారు, వారిలో నలుగురు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. 
 
బొలెరోలోని ప్రయాణికులతో పాటు మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం ఇంకా నిర్ధారించబడలేదు. అయితే ర్యాష్ డ్రైవింగ్ కారణం కావచ్చని అంచనా. ఈ ప్రమాదం అందరినీ కలిచివేసింది. వారి అభిమానులతో సహా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుకు కోపం వస్తుంది.. బీజేపీలోకి వైకాపా నేతలకు నో ఎంట్రీ..?