Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (16:27 IST)
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ప్రయాణికులతో వెళుతున్న ఆటో నుజ్జునుజ్జయింది. 
 
దీంతో ఆటోను నడుపుతున్న మహిళా డ్రైవర్ సహా మొత్తం నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా.. పోలీసులు వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు నుంచి ఓ ఆటో పది మంది ప్రయాణికులతో మల్లేలకు బయలుదేరింది. ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర్లో లారీని క్రాస్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించగా.. ఎదురుగా వస్తున్న బస్సు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments