Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (16:27 IST)
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ప్రయాణికులతో వెళుతున్న ఆటో నుజ్జునుజ్జయింది. 
 
దీంతో ఆటోను నడుపుతున్న మహిళా డ్రైవర్ సహా మొత్తం నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా.. పోలీసులు వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు నుంచి ఓ ఆటో పది మంది ప్రయాణికులతో మల్లేలకు బయలుదేరింది. ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర్లో లారీని క్రాస్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించగా.. ఎదురుగా వస్తున్న బస్సు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments