Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్తను కొడవలితో..

Advertiesment
crime scene
, శనివారం, 30 సెప్టెంబరు 2023 (19:15 IST)
మదనపల్లిలో ఓ భార్య భర్తను దారుణంగా కొడవలితో దాడి చేసింది. మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్తను కొడవలితో భార్య నరికేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో చోటుచేసుకుంది. 
 
దివ్యాంగుడైన వెంకటరమణ, మంగమ్మలు భార్య భర్తలు. భార్య మెడలో ఉండాల్సిన తాళిబొట్టు కనిపించకపోవడంతో భర్త నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య.. భర్తపై కొడవలి దాడి చేసింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య పుట్టిన రోజును పొరపాటున మర్చిపోతే?