Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసౌర నగరంగా అయోధ్య

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (15:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రామాలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది త్వరలోనే పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సౌరనగరంగా యూపీ ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. యూపీ రాష్ట్ర కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ ఈ పనులను చేపట్టనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాష్ట్రంలో తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. 
 
ఇందుకోసం ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. జనవరి 22వ తేదీన జరిగే అవకాశమున్న రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించారు. 
 
అదేసమయంలో అయోధ్య నగరాన్ని సౌర కాంతులతో నింపే పనులను ఇటీవల పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 'సూర్యవంశానికి రాజధాని అయోధ్య. కాబట్టి, ఇక్కడ ఇతర మార్గాల ద్వారా కాకుండా ఆ సూర్యుడి ద్వారానే విద్యుత్తు ప్రసరిస్తుంది' అని ప్రకటించారు. 
 
ఈ ప్రణాళికలో భాగంగా సరయూ నది ఒడ్డున 40 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు మొదలు సౌరశక్తితో నడిచే పడవలు, ప్రజా రవాణా, మొబైల్‌ చార్జింగ్‌ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల విద్యుదీకరణ.. ఇలా సర్వం సోలార్‌ పవర్‌ ఆధారంగానే నడవనున్నాయి. అందుకు తగిన విధంగా  ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం