Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాహసీల్దార్ ఎదుట గొంతు కోసుకున్న రైతు

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ తాహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యకు యుత్నించారు. తాహసీల్దార్ ఎదుటే తన గొంతు తాను కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఎవరూ ఊహించని ఘటనతో ఇది కలకలం రేపింది. గత 15 యేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు తన సమస్యను పరిష్కరించలేదంటూ తారాకపురం గ్రామానికి చెందిన గడ్డం సుంకన్న అనే రైతు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ వెంటనే స్పందించిన తాహసీల్దారు కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి రైతును హుటాహుటిన బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
ఈ ఘటనపై బాధిత రైతు మాట్లాడుతూ, కల్లుదేవనహళ్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 6.68 ఎకరాల భూమిని 1974లో తమ తండ్రి లింగప్ప కొనుగోలు చేశారని, ఇందులో శాంతకుమార్ ఒక ఎకరా, నరసింహులు అనే వ్యక్తి 1.5 ఎకరా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. పైగా తమపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కింద కేసు నమోదు చేయించారని వాపోయారు. 
 
ఈ విషయమై బొమ్మనహాళ్​ తహసీల్దార్ మునివేలు స్పందిస్తూ, రైతు సుంకన్న కార్యాలయం లోపలికి రాలేదన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వెంటనే బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. రైతు సుంకన్న వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డులు గాని, ఆధారాలు కానీ లేవని, భూ సమస్యపై రైతులు గత కొన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సర్వేయర్ భూమి కొలతలు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా రైతు సుంకన్న ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు. ఇప్పుడు రెండోసారీ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments