Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ ఆశావాది ప్రకాశరావు కన్నుమూత

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (08:31 IST)
ప్రముఖ సాహితీవేత్త, కవి, అవధాని, ఆశావాది డాక్టర్ ప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 యేళ్లు. అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో గురువారం మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈయన 52 యేళ్ల పాటు సాహితీ జీవితంలో 50కి పుస్తకాలు రాశారు. 170కి పైగా అవధానాలు చేశారు. ప్రకాశరావు సాహితీ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గత 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో సన్మానించింది. 
 
కాగా, ప్రకాశ రావు మృతి పట్ల రాజకీయ సాహితీ ప్రముఖులు, పలువురు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశ రావు తన నేత్రాలను ఇప్పటికే దానం చేసి ఉండటంతో సాయి ట్రస్టు నేతృత్వంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రికి ఆయన నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. 
 
కాగా, ఈయన రచించిన రచనల్లో పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, మెరుపుతీగలు, చెల్లపిళ్ల రాయ చరితము, విద్యా విభూషణ, ఘోషయాత్ర, పోతనల తులనాత్మక పరిశీలనతో పాటు అనువాద గ్రంథాలు, సుబోధిన వ్యాకరణం వంటి రచనలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments