Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయమాటలతో రూ.4.88 లక్షలు... మహిళ చేతిలో మోసపోయిన డాక్టర్

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ తన ఖాతాలో డబ్బులు వేయించుకుని వైద్యుడిని మో

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (10:16 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ తన ఖాతాలో డబ్బులు వేయించుకుని వైద్యుడిని మోసం చేసిన సంఘటనపై పటమట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 
 
కృష్ణా జిల్లా, విజయవాడ, అయ్యప్పనగర్‌కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నాడు. రెండు నెలల కిందట ఆయనకు ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. రెండు నెలలుగా ఇద్దరు ఫేస్‌బుక్‌లో ఛాటింగ్‌ చేసుకుంటున్నారు. లండన్‌ నుంచి విజయవాడ వస్తున్నానని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని ఆ మహిళ ఈ నెల 15న కృష్ణమూర్తికి ఫోన్‌ చేసి చెప్పింది. 
 
ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేందుకు తన దగ్గర ఇండియన్‌ కరెన్సీ లేదని చెప్పింది. ఆమె విమానాశ్రయంలో నిలబడి ఉందని, 20 వేల పౌండ్లు ఉన్నాయని మరో వ్యక్తితో కూడా ఫోన్‌ చేయించి మాట్లాడించింది. తన ఖాతాకు ఇండియన్‌ కరెన్సీ పంపించాలని కోరింది. 
 
ఆ మాటలు నమ్మిన కృష్ణమూర్తి 15, 16 తేదీల్లో మొత్తం రూ.4.88 లక్షలు ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలో వేశారు. ఆ తర్వాత ఆ మహిళ నుంచి ఎటువంటి సమాచారం లేదు.. ఫోన్‌ లేదు. దీంతో మోససోయినట్లు గ్రహించిన ఆయన పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments