Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో అన్ని సామాజిక వ‌ర్గాలకు ప్రాధ్యానం

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (18:14 IST)
న‌గ‌ర పాలక సంస్థ కౌన్సిల్ లో మంచి నిర్ణ‌యాలు తీసుకుని విజ‌య‌వాడ‌ను అభివృద్ది దిశ‌గా తీసుకువెళ్లేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, అందులో భాగంగా బీసీల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చామ‌ని  దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

శ‌నివారం న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ స‌మావేశంలో ఐదుగురు స‌భ్యుల‌ను విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ  కో-ఆప్టెడ్ స‌భ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీక‌రిమునిసా, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఐదుగురు న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్యులను అభినందించి, స‌న్మానించారు.
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ,  అన్ని సామాజిక వ‌ర్గాల వారికి న్యాయం చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని,  అందులో భాగంగా ఐదుగురి న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్యులుగా ఎన్నికోవ‌డం జ‌రిగింద‌న్నారు. మైనార్టీల‌కు జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం అధిక ప్రాదాన్యం ఇస్తోంద‌ని, అంద‌రినీ క‌లుపుకుని విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి కృషి చేస్తామ‌న్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎల‌క్ష‌న్ అధార్టీ, క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిన్‌స్ట్రేష‌న్ వారి స‌ర్క్యుల‌ర్ ప్రకారం ర్యాజంగ బ‌ద్దంగా నామినేష‌న్ ప‌ద్ద‌తిలోనే ఐదుగురి స‌భ్యుల‌ను న‌గ‌ర పాల‌క సంస్థ కో-అప్టు స‌భ్యుల ఎన్నిక జ‌రిగింద‌ని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. న‌గ‌రంలోని 64 మందితో క‌లిపి ఈ 5 గురు స‌భ్యులు కూడా న‌గ‌రాభివృద్దికి కృషి చేయాల‌న్నారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎల‌క్ష‌న్ అధార్టీ, క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిన్‌స్ట్రేష‌న్ వారి స‌ర్క్యుల‌ర్ ప్రకారం ర్యాజంగ బ‌ద్దంగా నామినేష‌న్ ప‌ద్ద‌తిలోనే ఐదుగురి స‌భ్యుల‌ను న‌గ‌ర పాల‌క సంస్థ కో-అప్టు స‌భ్యుల ఎన్నిక జ‌రిగింద‌ని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. న‌గ‌రంలోని 64 మందితో క‌లిపి ఈ 5 గురు స‌భ్యులు కూడా న‌గ‌రాభివృద్దికి కృషి చేయాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments