Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని అమరావతే.. అధైర్యం వద్దు : మంత్రి కిషన్ రెడ్డి

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (12:28 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతేనని, అందువల్ల ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సికింద్రాబాద్‌లో గృహ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో అమరావతి రైతులు, మహిళలు అక్కడకు వచ్చి ఓ వినతి పత్రం సమర్పించారు. 
 
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని.. దానిని అక్కడే కొనసాగించాలని, తమను కాపాడాలని కిషన్‌ రెడ్డి కాళ్లుపట్టుకుని ప్రాధేయపడ్డారు. దీంతో భావోద్వేగానికిలోనైన మంత్రి కిషన్ రెడ్డి... పైవిధంగా భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం చేస్తానన్నారు. దీంతో రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విభిన్న ప్రకటనల వల్లే ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. 'రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చినప్పుడు వారికి ధైర్యం చెప్పి, అండగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపై ఉంటుంది. రైతుల నుంచి ఇప్పటికే భూముల సేకరణ జరిగింది. పార్టీలు, ప్రభుత్వం కలిసి చర్చించుకోవాలి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడం మంచిది కాదు' అని హితవుపలికారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments