Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహోద్యమంగా ఇంధ‌న‌ పొదుపు... విజ‌య‌వాడ‌లో ర్యాలీ

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (12:08 IST)
దేశాన్నే కాదు... ప్ర‌పంచాన్నే ఇపుడు శాసిస్తోన్న‌ది ఇంధ‌నం. పెట్రోలు, డీసిల్ రేట్లు పెరిగిపోవ‌డంతోపాటు, విద్యుత్ వినియోగం కూడా పెర‌గ‌డంతో ఆకాశాన్ని అంటుతున్న ఇంధ‌న రేట్ల‌ను త‌గ్గించాలంటే, పొదుపు చాలా ముఖ్య‌మ‌ని గుర్తించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నారు.
 
 
ఇంధ‌న పొదుపుపై న‌గ‌ర వాసుల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు విజ‌య‌వాడ‌లో ఇంధ‌న పొదుపు ర్యాలీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వరకు ఇంధన పొదుపుపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో వియంసి కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 
రాష్ట్రంలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధన అదాకు ప్ర‌ణాళిక వేశామ‌ని, మహోద్యమంగా విద్యుత్ పొదుపు ను తీర్చిదిద్దుతామ‌ని ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల‌లో ఇంధ‌న పొదుపు అత్యావ‌శ్య‌క‌మ‌న్నారు. ఇంధన పొదుపు పై అవగాహన కలిగించే పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన ఇంధన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్, కలెక్టర్ జె.నివాస్ విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments