Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మున్సిపల్ పోల్స్ : మంత్రి ఆళ్ళ నాని ఓటు గల్లంతు

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (16:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని ఓటు గల్లంతు అయింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఎన్నికల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో భాగంగా, మంత్రి ఆళ్ళ నాని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏలూరులోని శనివరపుపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాగా, ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తెలుసుకుని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. 
 
దీంతో పోలింగ్ బూత్ సిబ్బంది క్షుణ్ణంగా 20 నిమిషాల పాటు తనిఖీ చేయగా, ఆయన ఓటరు నంబరుపై ఓ మహిళ పేరు నమోదైవున్నట్టు గుర్తించారు. దీంతో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. 
 
కాగా, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు పోలింగ్ నిర్వహించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికలు నిర్వహించినప్పటికీ... ఫలితాలను మాత్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు వెల్లడించవద్దని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments