Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు చీరేస్తానంటూ ఎంపీడీవోను హెచ్చరించిన నల్లచెరువు వైకాపా నేత

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్ల చెరువు గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీడీవోను పరుష పదజాలంతో గట్టిగా హెచ్చరించారు. నా మాట వినకుంటే నాలుక చీరేస్తానంటూ మందలించాడు. ఈ బెదిరింపులకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ మండలంలో వైకాపా నేతల మధ్య గ్రూపు రాజకీయాలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో తమ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించిన నల్లచెరువు మాజీ సర్పంచ్ వానంశెట్టి తాజాజీ సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. 
 
కార్యాలయంలోకి అడుగుపెడుతూనే ఎంపీడీవో కేఆర్ విజయపై విరుచుకుపడ్డారు. తమ మాట వినడం లేదని, మాట వినకుంటే చీరేస్తానని హెచ్చరించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సూపరింటెండెంట్ దీక్షితులు చెబుతున్నా వెనక్కి తగ్గలేదు కదా... అసభ్య పదజాలంతో దూషించారు. 
 
తాను ఇక్కడ పని చేయడం ఇష్టం లేదని, ఎక్కడికైనా పంపించాలని ఎంపీడీవో చెబుతున్నా తాతాజీ మాత్రం వినిపించుకోలేదు. ఆ తర్వాత ఎంపీడీవో నేరుగా వెళ్లి అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేసి, తనకు వైకాపా నేతల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments