నోరు చీరేస్తానంటూ ఎంపీడీవోను హెచ్చరించిన నల్లచెరువు వైకాపా నేత

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్ల చెరువు గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీడీవోను పరుష పదజాలంతో గట్టిగా హెచ్చరించారు. నా మాట వినకుంటే నాలుక చీరేస్తానంటూ మందలించాడు. ఈ బెదిరింపులకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ మండలంలో వైకాపా నేతల మధ్య గ్రూపు రాజకీయాలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో తమ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించిన నల్లచెరువు మాజీ సర్పంచ్ వానంశెట్టి తాజాజీ సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. 
 
కార్యాలయంలోకి అడుగుపెడుతూనే ఎంపీడీవో కేఆర్ విజయపై విరుచుకుపడ్డారు. తమ మాట వినడం లేదని, మాట వినకుంటే చీరేస్తానని హెచ్చరించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సూపరింటెండెంట్ దీక్షితులు చెబుతున్నా వెనక్కి తగ్గలేదు కదా... అసభ్య పదజాలంతో దూషించారు. 
 
తాను ఇక్కడ పని చేయడం ఇష్టం లేదని, ఎక్కడికైనా పంపించాలని ఎంపీడీవో చెబుతున్నా తాతాజీ మాత్రం వినిపించుకోలేదు. ఆ తర్వాత ఎంపీడీవో నేరుగా వెళ్లి అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేసి, తనకు వైకాపా నేతల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments