Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఆందోళన చెందక్కర్లేదు : కేంద్ర మంత్రి కుమారస్వామి

వరుణ్
శుక్రవారం, 12 జులై 2024 (11:32 IST)
ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సినపనిలేదని కేంద్ర మంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారు. విశాఖ ప్లాంట్‌ను రక్షించడం తమ బాధ్యత అని ఆయ స్పష్టం చేశారు.
 
వైజాగ్ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం అంతకుముందు ఆయన ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమి నేతలతో కలిసి విశాఖ స్టీలుప్లాంటును సందర్శించారు. ప్లాంట్‌లోని వివిధ భాగాలను పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు. కాకపోతే ఈ  విషయం వెల్లడించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి కావాలి. ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంది. అందుకోసం మేము విస్తృతంగా చర్చించాం. 
 
ప్లాంటును దారికి తెచ్చేందుకు సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని ముందు ఉంచుతాం.. అయినా ప్రైవేటీకరణ చేస్తామని, అమ్ముతామని ఎవరు చెప్పారు' అని ఆయన ప్రశ్నించారు. 
 
'విశాఖ స్టీలుప్లాంటు మూసివేతపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్ఎల్) కుటుంబ సభ్యులెవరూ ఎలాంటి భయాలూ పెట్టుకోవాల్సిన పనిలేదు. 
 
ప్రధాని మోడీ ఆశీస్సులతో నెలన్నరలో ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుంది' అని కేంద్రమంత్రి హెచ్ఐ కుమారస్వామి కార్మిక, ఉద్యోగసంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. ఉక్కు కర్మాగారం ఉత్పాదన తీరును సీఎండీ అతుల్భట్ వారికి వివరించారు. ఈడీ వర్క్స్ భవనంలోని మోడల్ గదిలోని గ్యాలరీలో ఉంచిన అవార్డులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments