Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడ శ్రీనివాస్ ఆలనా.. పాలనా నేనే చూసుకున్నా : దివ్వల మాధురి

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (18:39 IST)
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండిళ్ల పంచాయతీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తన భార్య దువ్వాడ వాణి, ఇద్దరు కుమార్తెలకు దూరంగా తన సన్నిహితురాలు దివ్వల మాధురి నివాసంలో ఉంటూ వచ్చారు. ఈ వ్యవహారం ఇటీవలే బహిర్గతమైంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, ఆయన పెద్ద కుమార్తె హైందవి కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఉండే ఇంటివద్దకు వెళ్లి ఆందోళన చేయడంతో ఈ గుట్టు రట్టయింది. ఈ పరిస్థితుల్లో దివ్వల మాధురి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. 
 
ఇంతకాలంలేని భయం, ప్రాణహాని ఇపుడు ఎందుకు కలుగుతుందని ప్రశ్నించారు. తనవల్ల దువ్వాడకు ప్రాణహాని ఉందని వాణి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ ఆలనా పాలనా తానే చూసుకున్నట్టు చెప్పారు. గత రెండేళ్లుగా లేని థ్రెట్‌ ఇప్పుడే వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. దువ్వాడను చంపడానికి వాణి ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
పది మందిని తీసుకొచ్చి తలుపులు పగులగొట్టారని, ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసని దివ్వల మాధురి అన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్లు ఇచ్చానని, వాణి తన డబ్బు చెల్లించి ఇంటిని తీసుకోవచ్చని మాధురి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments