Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అక్టోబర్ 2 న గిరిజనులకు భూ పట్టాల పంపిణీ

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:10 IST)
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈనెల 9 న జరిగే వేడుకలలో గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు, భూ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని రాష్ట్ర గిరిజన సంక్షేమ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఆగష్టు 9 కి బదులుగా అక్టోబర్ 2 న పట్టాలను ఇస్తామని చెప్పారు. అయితే ఆదివాసీ దినోత్సవ వేడుకలు మాత్రం అన్ని ఐటిడిఏలలో జరుగుతాయని స్పష్టం చేశారు.

ఆదివారం నాడు రాష్ట్ర స్థాయిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా రాష్ట్ర స్థాయి లో నిర్వహించాల్సిన వేడుకను వాయిదా వేశామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు.

అయితే రాష్ట్రంలోని అన్ని ఐటిడిఏలలో ఆగస్టు 9 న ఎక్కడికక్కడ ఈ వేడుకలను నిర్వహించాల్సిందిగా ఐటిడిఏ పీవోలకు ఆదేశాలను జారీ చేశామని చెప్పారు. ఐటిడిఏలలో జరిగే ఈ వేడుకలలో జిల్లా అధికారులతో పాటుగా ప్రజా ప్రతినిధులు హాజరు అవుతారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విజయనగరంలో జరిగే ఆదివాసీ దినోత్సవ కార్య్రమానికి  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి హాజరు అవుతారని వివరించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పథకంలో భాగంగా అటవీ హక్కు పత్రాలు, ప్రభుత్వ భూములకు సంబంధించిన డికేటి పట్టాలను కూడా ఇవ్వాల్సి ఉందన్నారు.

అయితే కరోనా నేపథ్యంలో ఈ పట్టాల పంపిణీ వాయిదా వేశామని, అక్టోబర్ 2 న వాటిని గిరిజనులకు అందిస్తామని  అధికారులు విపులీకరించారు. ఆరోజున మరింత ఎక్కువ మందికి పట్టాలను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments