Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అవినీతి నిర్మూలనకు దిశ తరహా చట్టం

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:18 IST)
అవినీతి నిర్మూలనకు త్వరలో దిశ తరహా చట్టం తీసుకురానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిందేనని అన్నారు.

సిఎం మాట్లాడుతూ.. 1902 నెంబర్‌ను కూడా ఎసిబితో అనుసంధానం చేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి వచ్చే అవినీతి ఫిర్యాదులను కూడా స్వీకరించాలన్నారు. టౌన్‌ ప్లానింగ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, ఎంఆర్‌ఓ, ఎంపిడిఓ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదని చెప్పారు.

14400 నెంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించాలని, పర్మినెంట్‌ హౌర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లోనూ చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదన్నారు. అవినీతి కేసుల్లో దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు.

కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోందని చెప్పారు. ఈ తరహా కేసులు అవినీతి నిర్మూలనకు చిత్తశుద్దితో లేమన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెడతాయని తెలిపారు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలన్నారు.

అవినీతి నిర్మూలనకు దిశ తరహాలో చట్టం తీసుకురావాలన్నారు. ఆ మేరకు బిల్లును రూపొందిస్తే అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments