Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని ఉమాను ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమార లేదు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:19 IST)
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమారలేదని ఎమ్మెల్మే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ చేతిలో ఓటమిని దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరిగితే, అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు.

దేవినేని ఉమా అనుచరులతో రాత్రిపూట పరిశీలనకు వెళ్తారా, దానిని ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేస్తారా అని మండిపడ్డారు. ఏదోరకంగా వసంత కృష్ణ ప్రసాద్‌పై బురదజల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలని హితవు పలికారు. గతంలో జక్కంపూడిలో దేవినేని ఉమాను ప్రజలే తరిమికొట్టారని గుర్తుచేశారు.

దేవినేని ఉమా రాజకీయ నాయకుడు కాదు.. గోబెల్స్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్‌ల‌ని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవినేని ఉమా కాదు సొల్లు ఉమా అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.

మైలవరంలో మొత్తం దోచుకున్నది దేవినేని ఉమానేనని, దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్‌ దోచుకున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని, దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments