Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:16 IST)
ఢిల్లీలో పార్ల‌మెంట్ సెష‌న్స్ ని వైసీపీ ఎంపీలు చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ ఇచ్చిన ప్లానింగ్ ప్ర‌కారం రోజుకో కేంద్ర మంత్రిని క‌లుస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు.

దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ,  ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం.

మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నార‌ని వివ‌రించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీనికి సానుకూలంగా స్పందించార‌ని, మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించార‌ని మ‌హిళా ఎంపీ వంగా గీత‌ మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments