Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతి ప్రజ్వలనకు నిరాకరించిన సీఎం జగన్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (14:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఇటీవల అమెరికాలో పర్యటనకు వెళ్లారు. తన కుటుంబ సమేతంగా ఆయన యూఎస్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన డల్లాస్‌లో జరిగిన ఓ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు జగన్‌తో జ్యోతి ప్రజ్వలన చేయించడానిక నిర్వాహుకులు పడిన శ్రమ అంతాఇంతాకాదు. అయినా సరే జగన్ మాత్రం జ్యోతి ప్రజ్వలనకు నిరాకరించారు. 
 
నిజానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహన రెడ్డికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పూజలు, యజ్ఞాలు, యాగాలు చేశారు. మరిప్పుడు డల్లాస్‌లో జరిగిన సభలో జ్యోతిప్రజ్వలన చేయడానికి జగనన్న ఇష్టపడలేదు. 
 
సాధారణంగా ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు జ్యోతి వెలిగించడం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఒక మంచి పనిని ప్రారంభించేటప్పుడు అది నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ యావత్ భారతజాతి జ్యోతిని వెలిగిస్తుంది. అటువంటి దివ్య హైందవ సంప్రదాయాన్ని నిర్వాహకులు బతిమాలుతున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం నిరాకరించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments