Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారం... ఆపై రూ.1.50 లక్షలకు బేరం

విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (15:26 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ బాలికను నమ్మించి బస్సులోనే అత్యాచారం చేయడం కాకుండా, చేసిన నేరం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలకు బేరమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖలోని వీఈపీజెడ్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో గిరిజన బాలిక పనిచేస్తోంది. ఈ కంపెనీ బస్సుడ్రైవర్‌ విశ్వానాథ్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ బాలిక విధులు ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న సమయంలో బస్సు డ్రైవర్‌ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. అయితే, ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విశ్వనాథ్‌ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments