Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాపై నమ్మకం పోయింది.. రాష్ట్రానికి పెద్ద దిక్కుకావాలి : పురంధేశ్వరి

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (17:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అధికార వైకాపాపై ఉన్న నమ్మకం పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెద్ద దిక్కు కావాలని బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి అన్నారు. విశాఖ వేదికగా బీజేపీ రాష్ట్ర శాఖ సమావేశం జరిగింది. ఇందులో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, వైకాపా పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు కార్యకర్తల సమిష్టి కృషి అని కార్యకర్తలను విశ్వసించే పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో లభించిన విజయం స్ఫూర్తితో ఏపీలోని బీజేపీ శ్రేణులు, నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అంతేకాకుండా, వైకాపా పాలన తప్పులను ప్రజలు ఎత్తి చూపాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం ఏపీ అప్పులాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సమాయానికి రాష్ట్ర అప్పులు రూ.2 లక్షల కోట్లు ఉండగా ఇపుడు అది ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. అంటే ఏపీలోని ప్రతి ఒక్క పౌరుడిపై రూ.1.2 లక్షల రుణభారం ఉందని ఆమె వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments