Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన పెథాయ్.. గంటకు 80 కి.మీ వేగంతో గాలులు

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (13:02 IST)
తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి సమీపంలో ఉన్న కాట్రేనికోన వద్ద పెథాన్ తుఫాను తీరాన్ని తాకింది. సోమవారం మధ్యాహ్నం 12.15 గంటల సయమంలో ఈ తుఫాను తీరాన్నిదాటింది. దీంతో తీరంవెంబడి వీచే గాలుల్లో వేగం ఒక్కసారిగా పెరిగింది. కోస్తా తీరంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం వెంబడి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. 
 
తుఫాన్ తీరం దాటడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు విరిగిపడిపోయాయి. ఈ కారణంగా విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. తుఫాను కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విషయం తెల్సిందే. మొత్తంమీద పెథాయ్ తుఫాను తీరందాటిన తర్వాత పెను విధ్వంసం సృష్టించింది. ఫలితంగా భారీ ఆస్తినష్టం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments